లాయర్స్‌నే బురిడీకొట్టించిన సైబర్ కేటుగాళ్లు.. కేదార్‌నాథ్‌ దర్శనానికి ఫేక్ టికెట్స్!

by Ramesh N |
లాయర్స్‌నే బురిడీకొట్టించిన సైబర్ కేటుగాళ్లు.. కేదార్‌నాథ్‌ దర్శనానికి ఫేక్ టికెట్స్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: సైబర్ నేరగాళ్లు రోజురోజుకు పేట్రేగిపోతున్నారు. ఈజీ మనీకి అలవాటు పడిన కేటుగాళ్లు.. టెక్నాలజీని వాడుకోని ఎంతటి వారినైనా ఇట్టే మోసం చేస్తున్నారు. పెద్ద అధికారుల నుంచి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల వరకు సైబర్ కేటుగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు. తాజాగా సైబర్ నేరగాళ్లు న్యాయవాదలను కూడా బురిడీ కొట్టించారు. జోగులాంబ గద్వాల జిల్లా, అలంపూర్ తాలూకాకు చెందిన న్యాయవాదుల బృందం జార్ఖండ్ రాష్ట్రం నుంచి కేదార్నాథ్ ఆలయ దర్శనానికి వెళ్ళింది. జార్ఖండ్ లోని పట్టా నగరం నుంచి ఆలయానికి హెలికాప్టర్‌లో ప్రయాణించేందుకు ఆన్‌లైన్ ద్వారా టికెట్ బుక్ చేసుకున్నారు. కానీ తీరా హెలిప్యాడ్ వద్దకు వెళ్లేసరికి అక్కడి అధికారులు అవి నకిలీవని వారిని అనుమతించలేదు. దీంతో వారు కంగుతిన్నారు.

ఈ సందర్భంగా ఓ బాధిత లాయర్ మాట్లాడుతూ.. ఆన్ లైన్‌లో హెలికాప్టర్ బుకింగ్ రూ. 5 వేల నుంచి రూ. 8 వేలకు పైగా వరకు చెల్లించామని తెలిపారు. తమలాగే 150 మందికి పైగా తెలుగువారు ఇక్కడ ఉన్నారని, వారిలో చిన్నపిల్లలు, మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారని లాయర్లు వెల్లడించారు. ఎవరైనా హెలికాప్టర్ టికెట్లు ఉన్నాయంటే నమ్మవద్దని సూచించారు. జార్ఖండ్ ప్రభుత్వం తక్షణమే దీనిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు.

Click Here For Twitter Post..

Advertisement

Next Story

Most Viewed